రాజేంద్రనగర్ గోడౌన్లో అగ్నిప్రమాదం.. ఓనరే హంతకుడా.. కూలీలను షాపులో పెట్టి తాళం వేశాడు...
హైదరాబాద్ రాజేంద్రనగర్లో చోటుచేసుకున్న ఘోర అగ్ని ప్రమాదానికి గోడౌన్ నిర్వాహకుడే కారణమని తేలింది. ఉప్పర్పల్లిలోని ఏవీ వన్ కూలర్ తయారీ కేంద్రం నిర్వాహకుడు రాత్రి వేళ కూడా పనిచేయాల్సిందేనని తన వద్ద ఉన్
హైదరాబాద్ రాజేంద్రనగర్లో చోటుచేసుకున్న ఘోర అగ్ని ప్రమాదానికి గోడౌన్ నిర్వాహకుడే కారణమని తేలింది. ఉప్పర్పల్లిలోని ఏవీ వన్ కూలర్ తయారీ కేంద్రం నిర్వాహకుడు రాత్రి వేళ కూడా పనిచేయాల్సిందేనని తన వద్ద ఉన్న ఆరుగురు కూలీలను ఆదేశించడమే కాకుండా గోడౌన్లోనే వుంచి బయట తాళం వేసుకుని వెళ్లిపోవడంతో.. కూలీలు సజీవ దహనం అయ్యారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఆ రాత్రిపూట గోడౌన్లో కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా మంటలు అలముకున్నాయి. షెట్టర్ను ఓపెన్ చేసేందుకు ఎంత పోరాడినా లాభంలేకపోయింది. యజమానికి ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. దీంతో వారి ఆర్తనాదాలు విన్న.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు గమనించి షెట్టర్ తాళాలు పగులగొట్టారు. అప్పటికే ఆ కూలీలు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనకు కారణమైన షాపు ఓనర్ ప్రమోద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.