Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసం కోసం... ఘర్షణ... 17 మందికి గాయాలు.. ఎక్కడా?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (11:49 IST)
పౌరుషాలు రాజ్యమేలుతున్న చోట ఘర్షణలకు, గొడవలకు ప్రత్యేక కారణాలు అవసరం లేదు. చెత్త, మట్టి, మాంసం ఏదైనా సరే.. సాకు దొరికితే చాలు కొట్టుకోవడానికి.. తిట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కేవలం మాంసం కోసం రెండు గ్రూపులు తెగబడ్డాయి. అట్టా ఇట్టా కాదు. కత్తులతో పొడుచుకుని, కొడవళ్లతో నరుక్కునే స్థాయి వచ్చారు. వివరాలిలా ఉన్నాయి. 
 
కర్నూలు జిల్లా రుద్రవరం మండలం గోనంపల్లెలో ఆదివారం స్థానికులు గంగమ్మకు దున్నపోతును బలి ఇచ్చారు. మాంసం పంపకాల్లో రెండు వర్గాల మధ్య తేడా వచ్చింది. ఆ ఊరి సంప్రదాయ పద్ధతుల ప్రకారం ప్రతి ఏడాది దున్నపోతులను బలి ఇస్తారు. ఆ క్రమంలోనే ఆదివారం కూడా బలి ఇచ్చారు. అయితే వాటి మాంసం పంపకాల్లో చిన్నపాటి గొడవ మొదలైంది. 
 
అది కాస్త పెద్దదై 17 మందికి గాయాలయ్యే పరిస్థితి దాకా వెళ్లింది. ఇలాంటి ఘటన ఎపుడూ జరగలేదని ఆ గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments