Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దారుణం: కూతురిపైనే కీచక తండ్రి అత్యాచారం!

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (18:50 IST)
మహిళలకు బయటా కాదు సొంత ఇంట్లోనే రక్షణ లేకుండా పోయింది. కృష్ణా జిల్లా విజయవాడలోని వాంబే కాలనీలో సభ్యసమాజం సిగ్గుతో తలొంచుకునే దారుణం చోటుచేసుకుంది. తండ్రే కన్నబిడ్డ పాలిట కీచకుడయ్యాడు. అజిత్ సింగ్ నగర్‌లోని వాంబే కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ అప్పారావు (42)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె (17) పదో తరగతి వరకు చదివింది. 
 
స్థానికంగా ఉండే యువకుడితో ఆమె పరిచయం ఏర్పరచుకుంది. విషయం తెలిసిన అప్పారావు ఆమెపై అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. బలం కోసమని చెప్పి భార్య, కుమార్తెకు మత్తు మందులు ఇవ్వడం ప్రారంభించాడు. వారిద్దరూ మత్తులోకి జారుకున్నాక కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. 
 
ఈ మధ్యనే అనుమానంతో భార్య అప్పారావును నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లీకూతుళ్లు గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. విచారణలో ఏడాదిగా ఈ దారుణం జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు దిగ్భ్రాంతి చెందారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments