Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రానికి పట్టిన శనిని పట్టుకొని దేవుడు అంటావా? విజయ్‌చందర్‌కు చుక్కలు

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (15:06 IST)
స్థానిక బృందావన్ గార్డెన్స్‌లో ఉన్న వేంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికలో హైదరాబాద్‌కు చెందిన యువకళా వాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సంయుక్తంగా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరయిన విజయ్ చందర్ జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించబోయారు. 
 
అసలే రాజధాని తరలింపుపై ఆవేశంగా ఉన్న స్థానిక ప్రేక్షకులు ఇక చాలు ఆపమని గొడవ చేశారు. ఇదేమి పట్టించుకోని ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయచందర్ తన పొగడ్తలు కొనసాగిస్తుండగా
 ప్రేక్షకులు తీవ్ర వ్యతిరేకతతో స్టేజి వైపు దూసుకు వచ్చారు. ఊహించని సంఘటనతో కంగారుపడి ప్రసంగం మధ్యలోనే ముగించాడు. 
అయినా శాంతించని ప్రేక్షకులు స్టేజి పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా పరిస్థితి అదుపు తప్పుతుందని గమనించిన  నిర్వాహకులు అర్ధాంతరంగా విజయచందర్‌ను సభ నుండి కారు వద్దకు తీసుకవెళ్లే ప్రయత్నం చేశారు.
 
ఆ మార్గ మధ్యలో మహిళలు కూడా రాక్షసుడిలా మా భవిష్యత్‌ను నాశనం చేస్తూ, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంటే నీకు దేవుడిలా కనిపిస్తున్నాడా అంటూ విజయచందర్ పై వాగ్వాదానికి దిగారు. వారినుండి తప్పించుకొని కారు ఎక్కి వెళ్లబోతుండగా అక్కడి చేరుకున్న ప్రేక్షకులు కారును కదలనీయకుండా అడ్డంగా ఉండి గొడవకు దిగారు. 
 
సాంస్కృతిక కార్యక్రమానికొచ్చి రాజకీయాలు మాట్లాడతావా, రాష్ట్రానికి పట్టిన శనిని పట్టుకొని దేవుడు అంటావా అంటూ కారు కదలటానికి కూడా అవకాశం లేకుండా చుట్టుముట్టారు. దాదాపు అర్ధగంట పాటు గందరగోళ పరిస్థితిలో కారు దిగిన విజయచందర్ రెండు చేతులు జోడించి క్షమాపణ వేడుకున్నాడు.. దీంతో శాంతించిన ప్రేక్షకులు కారుకు దారి ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments