Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని రైతుల ఇళ్ళలో పోలీసుల సోదాలు.. ఏడుగురు రైతుల అరెస్టు

Webdunia
ఆదివారం, 29 డిశెంబరు 2019 (13:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, మందడం గ్రామాల్లోని పలు ఇళ్ళలో పోలీసులు ఆదివారం వేకువజామున ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల తర్వాత ఐడుగురు రైతులను పోలీసులు అరెస్టు చేసి, తెనాలి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
 
ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అర్థరాత్రి దాటాక తమ ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారని, కొందరిని అరెస్టు చేసి తీసుకెళ్లారని చెప్పారు. వెంకటపాలెం, మోదుగుల లింగాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారని రైతులు ఆరోపించారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడిచిపెట్టకపోతే పీఎస్‌ల ఎదుట ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. అరెస్టయినవారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని రైతులు తెలపారు. 
 
మరోవైపు, రైతుల అరెస్టు విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మరికొంతమంది నేతలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ వ్యవహారంపై డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. రైతుల ఆందోళలో బయట వ్యక్తులు పాల్గొంటున్నారని చెప్పారు. ఆదివారం ఏడుగురు రైతులను అరెస్టు చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments