ఏపీలో కల్తీ మద్యం తయారీ కేసు : ఇద్దరు తెలుగుదేశం నేతలపై వేటు

ఠాగూర్
సోమవారం, 6 అక్టోబరు 2025 (09:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం తయారీ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అధికార టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు హస్తం ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. దీంతో ఆ ఇద్దరు నేతలపై సస్పెన్షన్ వేటు వేసింది. 
 
ఈ కల్తీ మద్యం తయారీ కేసులో సంబంధం ఉన్నట్టు తేలిన తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ఆదివారం రాత్రి ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
అలాగే, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. పార్టీ అధినేత నారా చంద్రబాబ నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. నకిలీ మద్యం తయారీ కేసులో జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేష్, సన్నిహితుడు జనార్ధన్ రావు, సమీప బంధువుల పాత్ర ఉన్నట్టు నిర్ధారణ కావడంతో వారి ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై టీడీపీ అధిష్టానం చర్యలు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

Mohanlal: వృష‌భ‌ తో థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ మోహ‌న్ లాల్

Ari movie review : అరిషడ్వర్గాల నేపథ్యంగా అరి చిత్రం రివ్యూ

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం