Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జ‌గ‌న్‌ సృష్టించిన అబ‌ద్ధాలు ప్ర‌పంచం చుట్టి వ‌స్తున్నాయి: నారా లోకేష్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (18:05 IST)
అమరావతి భూముల వ్యవహారంపై ఫేక్ ఫిర్యాదు చేశారంటూ నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన ఇలా రాశారు.. నిజ‌మేంటో జ‌నానికి తెలిసేస‌రికి, సీఎం జ‌గ‌న్‌ సృష్టించిన అబ‌ద్ధాలు ప్ర‌పంచం చుట్టి వ‌స్తున్నాయి. అస‌త్య‌ ప్ర‌చారమే పెట్టుబ‌డిగా తెచ్చుకున్న‌ అధికారం అండ‌తో అమ‌రావ‌తిపై ప‌న్నిన మ‌రో కుట్ర‌ని తెలుగుదేశం బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. సీఎం ఆదేశాల‌తో, ఎమ్మెల్యే ఆర్కే అసైన్డ్ రైతుల పేరుతో, సీఐడీకి ఫేక్ ఫిర్యాదు ఇచ్చార‌ని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టాం.
 
ఇప్ప‌టికైనా ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తిపైనా, టిడిపిపైనా కుతంత్రాలు ఆపండి. అంద‌రి ఆమోదంతో, రైతుల త్యాగాల పునాదుల‌పై నిలిచిన ప్ర‌జారాజ‌ధానిపై విద్వేషంతో అమ‌రావ‌తి విధ్వంసానికి ప్ర‌య‌త్నించిన‌ ప్ర‌తీసారీ న్యాయ‌మే గెలుస్తుంది. నీ అస‌త్య‌పు కుట్ర‌లు బ‌ట్ట‌బ‌య‌ల‌వుతూనే వుంటాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments