కోర్టుకు కూతవేటు దూరంలో.. పట్టపగలు... నడి రోడ్డుపై నరికేశారు... ఎక్కడ? (Video)

రాయలసీమ జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ హత్యలు పురుడు పోసుకుంటున్నాయి. గతవారం కర్నూలు జిల్లాలో వైకాపాకు చెందిన ఇద్దరు కీలక నేతలు దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ ఘటన ఇంకా మరిచిపోకముందు.. గురువారం కడప జి

Webdunia
గురువారం, 25 మే 2017 (12:42 IST)
రాయలసీమ జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ హత్యలు పురుడు పోసుకుంటున్నాయి. గతవారం కర్నూలు జిల్లాలో వైకాపాకు చెందిన ఇద్దరు కీలక నేతలు దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ ఘటన ఇంకా మరిచిపోకముందు.. గురువారం కడప జిల్లాలో మరో ఫ్యాక్షన్ హత్య జరిగింది. పట్టపగలు, నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా నరికేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
పొద్దుటూరుకు చెందిన మారుతీ ప్రసాద్ రెడ్డి కుటుంబంలోని మహిళతో అక్రమ సంబంధం విషయంలో నలుగురు వ్యక్తులతో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాలు కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో కోర్టు వాయిదా కోసం మారుతీ ప్రసాద్ రెడ్డి వస్తున్న సమయంలో నలుగురు ప్రత్యర్థులు అతనిని అడ్డుకుని ఘర్షణ పడ్డారు. 
 
ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో ఆ నలుగురూ మారుతీ ప్రసాద్ రెడ్డిని కత్తులతో పొడిచారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసిన మారుతీ ప్రసాద్ రెడ్డిని వెంబడించి, నడి రోడ్డుపై కిందపడేశారు. ఆ తర్వాత ఒకరు తల పట్టుకుంటే.. మరొకరు కత్తితో మెడపై అనేక సార్లు దాడి చేశాడు. దీంతో ప్రసాద్ రెడ్డి హత్యా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇది అత్యంత పాశవికంగా... గొడ్డును చంపినట్టు అందరూ చూస్తుండగా నరికి చంపారు. ఈ దారుణం గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ హత్య జరుగుతున్న సమయంలో అనేక మంది రోడ్డుపై ఉన్నా.. వారి ఏ ఒక్కరూ కూడా అడ్డుకున్న పాపాన పోలేదు. ఈ హత్య పొద్దుటూరు కోర్టుకు కూతవేటు దూరంలో జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments