Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్సైజ్ ఠాణాలో కీచకపర్వం... నిందితుడి భార్యపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

ఖమ్మం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కీచకపర్వం జరిగింది. నిందితుడి భార్యపై ఓ కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అదీకూడా పీకల వరకు మద్యం సేవించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (08:44 IST)
ఖమ్మం జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కీచకపర్వం జరిగింది. నిందితుడి భార్యపై ఓ కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అదీకూడా పీకల వరకు మద్యం సేవించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఖమ్మంలోని రంగనాయకగుట్టకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ బెల్ట్‌ దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అతడి బెల్ట్‌షాపుపై ఎక్సైజ్‌ పోలీసుల దాడి చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ను ఎక్సైజ్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 
 
ఈ క్రమంలో ఆ ఆటోడ్రైవర్‌కు తోడుగా అతడి భార్య కూడా స్టేషన్‌కు వెళ్లింది. ఆదేసమయంలో ఎక్సైజ్‌ కార్యాలయంలోనే కానిస్టేబుల్‌ నరేందర్‌తో పాటు మరో ఇద్దరు మద్యం తాగుతూ కనిపించారు. 
 
అపుడు మద్యం మత్తులో ఆటో డ్రైవర్ భార్యపై నరేందర్‌తో పాటు.. మిగిలిన ఇద్దరూ దురుసుగా ప్రవర్తించి, అత్యాచారయత్నం చేశాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు నరేందర్‌ను సస్పెండ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments