Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతుల కోరిక నెరవేరింది.. చాలా సంతోషంగా ఉంది : వెంకయ్య నాయుడు

వరుణ్
శుక్రవారం, 14 జూన్ 2024 (08:21 IST)
అమరావతి రైతుల కోరిక మేరకు అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, అనేక అడ్డంకులు, ఇబ్బందులు, కష్టనష్టాలు ఎదుర్కొని వేలాది మంది రోజుల పాటు ఉద్యమం కొనసాగించిన అమరావతి రైతుల అభీష్టం నెరవేరిందన్నారు. 
 
ఏపీ సీఎంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. మొదటి నుంచి కూడా తాను  రాష్ట్రానికే ఒకే రాజధాని ఉండాలని ఆకాంక్షించానని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం వంటిదన్నారు. రాజధాని ఒక్కటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే ప్రతి ఒక్కరి కోరిక అని చెప్పారు. 
 
ఏపీ కానివ్వండి, మరే రాష్ట్రమైనా కానివ్వండి. సమగ్రాభివృద్ధి ఎంతో అవసరం అని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం తప్పు కాదని తెలిపారు. కాగా, గత వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధానికి లేకుండా చేయడమే కాకుండా అమరావతిని పూర్తిగా విధ్వంసం చేయాలన్న సంకల్పంతో శ్మశానంగా మార్చివేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments