Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితులలో పెయిడ్ బ్యాచ్‌కు సవాల్.. మీకు సిగ్గుంటే... ఇదే కులంలో పుట్టివుంటే...

Webdunia
బుధవారం, 22 జులై 2020 (11:54 IST)
తూర్పు గోదావరి జిల్లాలో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన ఘటనపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వైకాపా ప్రభుత్వంలో దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. అలాగే, బహిరంగంగా ఓ ఛాలెంజ్ విసిరారు. 
 
పోలీసుల చేతిలో బాధిత శిరోమండన యువకుడిని ఆయన స్వయంగా పరామర్శించారు. ఈసందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ, పోలీసు స్టేషన్‌లో దళిత యువకుడికి శిరోముండనం చేయడం దారుణం. 24 గంటలు టైం ఇస్తున్నాను. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, జైలుకు పంపించాలి. ఎస్‌ఐను సస్పెండ్‌ చేస్తే సరిపోదు. సీఐ, డీఎస్పీ, ఎస్పీలను కూడా సస్పెండ్‌ చేయాలి’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు. 
 
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఓ పథకం ప్రకారం దళితులపై దాడులు చేస్తున్నారు. అసలు దళిత ప్రజాప్రతినిధులకు సిగ్గు ఉందా? ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు, మంత్రులు ఉన్నారు. దళితులలో పెయిడ్‌ బ్యాచ్‌కు సవాల్‌ చేస్తున్నాను. మీకు సిగ్గు ఉంటే, ఇదే కులంలో పుట్టి ఉంటే ఖండించండి. పార్టీ ముసుగులు వదలండి. స్పందించండని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments