Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశ్నపత్రం లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు

Webdunia
బుధవారం, 11 మే 2022 (08:41 IST)
పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి పి.నారాయణకు బెయిల్ మంజూరైంది. నారాయణపై ఏపీ సీఐడీ పోలీసులు మోపిన అభియోగాలను తోసిపుచ్చిన చిత్తూరు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఆయనకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. 
 
నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ పదవికి గత 2014లోనే రాజీనామా చేసినట్టు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆ వాదనలతో అంగీకరించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆదేశించారు. 
 
కాగా, టెన్త్ ప్రశ్నపత్రాల లీక్ కేసులో నారాయణను మంగళవారం హైదరాబాద్ నగరంలో ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ఆయన్ను ఆయన కారులోనే చిత్తూరు తరలించారు. ఆ తర్వాత ఆయనకు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి ఆ తర్వాత మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచారు.
 
బెయిల్ లభించిన తర్వాత నారాయణ మాట్లాడుతూ, పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారు. దానితి తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు ఆధారాలు సమర్పించామని, దీంతో తనపై మోపిన నేరారోపణ నమ్మేలా లేదన్న అభిప్రాయానికి వచ్చిన న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments