Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూకుడు పెంచిన కిరణ్‌... 23వ తేదీన మాజీ ఎమ్మెల్యేలతో జనసేనలోకి...

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దూకుడు పెంచారు. జనసేన పార్టీలోకి చేరికను ఇప్పటికే ఖరారు చేసుకున్న కిరణ్‌ తనకున్న సన్నిహితులతో కలిసి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అది కూడా కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాప

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (13:58 IST)
మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దూకుడు పెంచారు. జనసేన పార్టీలోకి చేరికను ఇప్పటికే ఖరారు చేసుకున్న కిరణ్‌ తనకున్న సన్నిహితులతో కలిసి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అది కూడా కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన మాజీలను తీసుకుని వెళ్లనున్నారు. ఇప్పటికే అందరితోను సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బెంగుళూరులో మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు.
 
జనసేన పార్టీలో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతానని, రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసి పార్టీని గెలిపిద్దామని ప్రజాప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం. దీంతో వారంతా కిరణ్‌ వెంట నడవడానికి సిద్ధమయ్యారు. ఒకవైపు పవన్‌తో కూడా కిరణ్‌ చేసిన సంప్రదింపులన్నీ ఫలించడంతో పార్టీలోకి చేరిక సులభమైంది.
 
ఈనెల 23వ తేదీన హైదరాబాద్‌లోని పవన్‌ కళ్యాణ్‌ ఇంటి వద్దే కిరణ్‌ ముందుగా పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అంతేకాకుండా జనసేనలో చేరిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో ఒక సభను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments