Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఒక్కరికి పరిహారం అందుతుంది: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

Webdunia
మంగళవారం, 12 మే 2020 (19:47 IST)
ఎల్.జి. పాలిమర్స్ స్టైరీన్ గ్యాస్ లీక్ బాధితులలో ప్రతి ఒక్కరికి పరిహారం అందుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం కెజిహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల దరకు  పరిహరం పరిహరం అందుతుందని,  ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు బాధిత గ్రామాల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపిలు  అధికారులు రాత్రి బస చేసినట్లు చెప్పారు.  ఏ సమస్య లేకుండా ప్రభుత్వం చూసుకుంటుందని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక విభాగధిపతులచే, పరీక్షలు, వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. మంచి నీళ్లు ట్యాంకుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుదని చెప్పారు. 

అందరూ సంతోషంగా ఉండాలని, ప్రజల సంక్షేమే ప్రభుత్వానికి ముఖ్యమని  పేర్కొన్నారు.  సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, కెజిహెచ్ పర్యవేక్షకులు డా.జి. అర్జున్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments