Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ను విజయవంతం చేయటం ప్రతి పౌరుడి బాద్యత: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (19:17 IST)
భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు అవుతున్న శుభతరుణంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించిన ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ వేడుకలలో పాల్గొని విజయవంతం చేయటం ప్రతి పౌరుని బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
 
2022 ఆగస్టు 15కు 75 వారాల ముందస్తుగా మార్చి 12న 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' ప్రారంభించబడిందని గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. 1930లో మహాత్మా గాంధీ నేతృత్వంలోని చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రహ దండి యాత్ర ప్రారంభమైందని దాని 91వ వార్షికోత్సవం కూడా ఈ సంవత్సరమేనని గుర్తు చేసారు.
 
స్వాతంత్ర్య పోరాటం, ఉద్యమం అనే అంశంపై ప్రదర్శనలు, పోటీలు, విద్యార్థుల ర్యాలీలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థి సంఘాలు చురుకుగా కార్యక్రమాలలో పాల్గొని 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గుర్తు చేసుకోవాలన్నారు. ఏడాది పొడవునా జరిగే ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులను, వారి కుటుంబ సభ్యులను సత్కరించాలని గవర్నర్ శ్రీ హరిచందన్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments