Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పైన ఉన్న కేసులు చదివి ఆశ్చర్యపోయా... జస్టిస్ ఈశ్వరయ్య

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (19:03 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆల్ ఇండియా బిసి ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య. జగన్ ఏమన్నా పతివ్రతా అంటూ విమర్సించారు. జగన్ పైన ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసునని, జగన్ పైన ఉన్న కేసులు చదివి ఆశ్చర్యపోయానన్నారు. జగన్ బిసిల ద్రోహని, వైసిపి మేనిఫెస్టో అంతా బూటకమేనన్నారు. 
 
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని, విజయసాయిరెడ్డికి బిసిల రిజర్వేషన్ల గురించి ఏం తెలుసునని, రిజర్వేషన్ ఇస్తామని బిసిలను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. శరీరం అమ్ముకున్నవారికి నీతి, విలువ ఉంటుందని, రాజకీయనాయకులకు ఆ విలువ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జస్టిస్ ఈశ్వరయ్య. 
 
అగ్రవర్ణాలకు ఓటెయ్యవద్దని బిసిలకు పిలుపునిచ్చారు జస్టిస్ ఈశ్వరయ్య. చంద్రబాబు నాయుడు కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారని, స్టేలు తెచ్చుకుని ఆయన తిరుగుతున్నారని, తెలంగాణాలో కెసిఆర్, ఎపిలో చంద్రబాబు నాయుడులు ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని ఆరోపణలు చేసుకుంటుండడం విడ్డూరంగా ఉందన్నారు జస్టిస్ ఈశ్వరయ్య.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments