జగన్ పైన ఉన్న కేసులు చదివి ఆశ్చర్యపోయా... జస్టిస్ ఈశ్వరయ్య

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (19:03 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆల్ ఇండియా బిసి ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య. జగన్ ఏమన్నా పతివ్రతా అంటూ విమర్సించారు. జగన్ పైన ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసునని, జగన్ పైన ఉన్న కేసులు చదివి ఆశ్చర్యపోయానన్నారు. జగన్ బిసిల ద్రోహని, వైసిపి మేనిఫెస్టో అంతా బూటకమేనన్నారు. 
 
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని, విజయసాయిరెడ్డికి బిసిల రిజర్వేషన్ల గురించి ఏం తెలుసునని, రిజర్వేషన్ ఇస్తామని బిసిలను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. శరీరం అమ్ముకున్నవారికి నీతి, విలువ ఉంటుందని, రాజకీయనాయకులకు ఆ విలువ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జస్టిస్ ఈశ్వరయ్య. 
 
అగ్రవర్ణాలకు ఓటెయ్యవద్దని బిసిలకు పిలుపునిచ్చారు జస్టిస్ ఈశ్వరయ్య. చంద్రబాబు నాయుడు కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారని, స్టేలు తెచ్చుకుని ఆయన తిరుగుతున్నారని, తెలంగాణాలో కెసిఆర్, ఎపిలో చంద్రబాబు నాయుడులు ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని ఆరోపణలు చేసుకుంటుండడం విడ్డూరంగా ఉందన్నారు జస్టిస్ ఈశ్వరయ్య.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments