Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ సర్కారు.. ఏంటది?

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (11:35 IST)
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.100 కోట్ల వ్యయంతో మూడు పాలిటెక్నిక్ కాలేజీలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం ఒక గెజిట్ విడుదల చేశారు. ఈ వివరాలను ఆ రాష్ట్ర విత్త మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 
 
ఈ పాలిటెక్నిక్ కాలేజీలను నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, కడప జిల్లాలోని మైదుకూరుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ కెమికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమో కోర్సుల్లో విద్యాభ్యాసం చేసేందుకు ఆయా ప్రాంతాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదని పేర్కొంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తికాగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. ఈ మూడుక కాలేజీల్లో ఒకదాన్ని రూ.30 కోట్లతో తన నియోకవర్గం డోన్ పరిధిలోని బేతంచర్లలో నిర్మిస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments