Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారత కాలం నాటి మర్రిచెట్టు: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను..?

Webdunia
బుధవారం, 27 మే 2015 (12:27 IST)
ఆ మర్రిచెట్టుకు సుమారు 5వేల ఏళ్లు. అది మహాభారత కాలం నాటిదని విశ్వాసం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ చెట్టు కిందే భగవద్గీతను బోధించారని కూడా భక్తులు విశ్వసిస్తారు. ఈ చెట్టు వయసు సుమారు 5 వేల ఏళ్లు పైమాటేనని పరిశోధకులు సైతం తేల్చడంతో దీన్ని కాపాడేందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నడుం బిగించింది. 
 
హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర సమీపంలోని జ్యోతిసర్‌లో ఉన్న ఈ చెట్టు మాత్రమే మహాభారత కాలం నుంచి జీవించి ఉన్న ఏకైక ఆధారమని భావిస్తున్న ఎన్జీటీ, చెట్టు ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తూ, దాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను గురించి వివరించాలని కురుక్షేత్ర డిప్యూటీ కమిషనర్‌కు నోటీసులు పంపింది. ఈ మర్రి చెట్టు నెమ్మదిగా అంతరిస్తోందంటూ ఇప్పటికే పలు ఎన్జీవో సంఘాలు కోర్టులను ఆశ్రయించి వున్నాయి. 
 
భక్తులు తమ కోరికలు తీరాలని ఆశిస్తూ, చెట్టుకు దారాలు కట్టడం, వివిధ రకాల గంటలను కొమ్మలకు వేలాడదీయడం చెట్టు ఎదుగుదలకు అడ్డంకిగా మారిందని వివరించారు. ఈ చెట్టును భావి తరాలకు అందించే చర్యలు చేపట్టాలని కోరారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments