Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా పాలనలో అపచారం.. దుర్గమ్మ సన్నిధిలో అధికారి రాసలీలలు!

ఠాగూర్
శనివారం, 4 మే 2024 (11:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా పాలనలో ప్రజలకే కాదు చివరకు హిందూ దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. గతంలో రామతీర్థంలో రాముల విగ్రహం తల తెగనరికారు. ఆ తర్వాత అనేక ఆలయాల్లో అపచారం జరిగింది. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి క్షేత్రంలో ఆలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంజనీరింగ్ అధికారి మహిళా సెక్యూరిటీ సిబ్బందిని తన చాంబర్‌కు పిలిపించుకుని వారు చేసిన చిన్నచిన్న తప్పులను లేవనెత్తుతూ వారిని లైంగికంగా లోబరుచుకున్నారు. 
 
మూడు రోజుల క్రితం కూడా ఒక మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ రాసలీలల ఎపిసోడ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సదరు ఇంజనీరింగ్ అధికారిపై ఆలయ సిబ్బందిలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఈ ఉదంతంపై దుర్గగుడి ఈవో రామారావు విచారణకు ఆదేశించారు. సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్న సాయిని విధుల నుంచి తొలగించారు. మరోవైపు, పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఇలాంటి చోటు చేసుకోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం