ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసూలు చేసే ఇంజనీరింగ్ ఫీజులు ఇవే...

వరుణ్
సోమవారం, 8 జులై 2024 (09:40 IST)
2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ కాలేజీల్లో వసూలు చేసే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 210 బీటెక్, రెండు ఆర్కికెట్చర్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా, ఈ కాలేజీలో కొత్త విద్యా సంవత్సరానికి వసూలు చేసే ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఇంజనీరింగ్ బీటెక్ కోర్సులో అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షల వరకు, అత్యల్పంగా రూ.40 వేల వరకు నిర్ణయించారు. ఇందులో రూ.40 వేల రుసుం ఉన్న కాలేజీలు 114 ఉండగా, రూ.లక్ష కంటే ఎక్కువ ఫీజును వసూలు చేసే కాలేజీలు ఎనిమిది ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలకు రూ.35 వేల చొప్పున రుసుము ఖరారు చేశారు. 
 
ఈ ఫీజు పరిధిలోనే ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ వస్తాయని పేర్కొంది. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదు. వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసేవారిపై చట్టప్రకారం జరిమానా విధించడంతోపాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం

ప్రతీ చోటా రాకాస కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments