Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 17 నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (09:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 17వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హెమచంద్రారెడ్డి తెలిపారు. ఈ ఇంజనీరింగ్ ప్రక్రియ మొత్తం వచ్చే 25వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. 
 
ఆయన వివిధ సెట్ల కౌన్సెలింగ్ వివరాలను ఆయన సోమవారం మంగళగిరిలోని మండలి కార్యాలయంలో విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ-సెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు, ఐ-సెట్ రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు, పీజీ సెట్ కౌన్సెలింగ్ ఈ నెల 27 నుంచి నవంబరు 3వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. 
 
అయితే, డిగ్రీ విద్యార్థులకు ఈ యేడాది నుంచి రెండు నెలల ఇంటర్న్‌షిప్ ఉంటుందని, ఇందులో కొందరికి వర్చ్యువల్, మరికొందరికి ఆఫ్‌లైన్‌లో ఇంటర్న్‌షిప్ అందించేలా వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. అదేసమయంలో ఈ నెల 15వ తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments