Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో గౌతమి చనిపోలేదు.. చంపేశారు.. తల్లి అనంతలక్ష్మి

పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో గౌతమి మరణించింది. గౌతమి రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, ఆమెను హత్య చేశారని గౌతమి తల్లి అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గౌతమి కేసు మళ్ళీ మొదటికొచ్చిం

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (11:39 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో గౌతమి మరణించింది. గౌతమి రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, ఆమెను హత్య చేశారని గౌతమి తల్లి అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గౌతమి కేసు మళ్ళీ మొదటికొచ్చింది. అయితే రోడ్డు ప్రమాదంలో మరణించిందని పోలీసులు తేల్చిన తర్వాత ఆమె తల్లి మరోసారి పోలీసులకు ఫిర్యాదుచేయడం కలకలం రేపుతోంది.
 
విశాఖ జిల్లాలో ఐఎఎస్ కోచింగ్ తీసుకుంటుంది. అయితే ఆమె సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన రెండు రోజుల్లోనే ఆమె మరణించింది. అయితే రోడ్డు ప్రమాదంలోనే గౌతమి మరణించిందని రెండు రోజుల క్రితం ఎఎస్ పి రత్న ప్రకటించారు. అయితే రత్న ప్రకటించిన మరునాడే గౌతమి తల్లి మరోసారి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తన కూతురును హత్య చేశారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది.
 
గౌతమి మరణంపై పోలీసులు చెప్పిన వివరాలతో ఆమె తల్లి సంతృప్తి చెందలేదని వార్తలు చెప్తున్నాయి. దీంతో ఆమె తన కూతురు రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, ఆమెను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని తల్లి అనంతలక్ష్మి ఆరోపిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments