Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల‌క్కాయ‌న‌కుని.. నాటుబాంబు న‌మిలిన ఏనుగు...! అక్క‌డిక‌క్క‌డే మృతి..!!

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (05:39 IST)
అడ‌వి పందుల కోసం పెట్టిన నాటుబాంబు.. ఓ ఏనుగుపిల్ల ప్రాణం తీసింది. వెల‌క్కాయ‌నుకుని బాంబును న‌మిలిన ఏనుగు పిల్ల అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించింది. రెండు రోజుల కిందట జరిగిన విషాదమిది.  చిత్తూరు జిల్లా య‌ర్ర‌వారిపాళెం మండ‌లంలో జ‌రిగిన సంఘ‌ట‌న వివ‌రాలిలా ఉన్నాయి. 
 
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఆహారం, నీళ్లు దొరక్క ఏనుగులు ఆ పక్కనే ఉన్న పంటపొలాలపై పడుతున్నాయి. త‌ల‌న‌కోన‌కు స‌మీపంలోని నెర‌బైలు ప్రాంతంలో రైతులు, వేట‌గాళ్ళు వాటిని పార‌ద్రోల‌డానికి, వేటడడానికి రెండింటికీ నాటుబాంబుల‌ను వినియోగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో నెరబైలు రెవెన్యూ పరిధిలోని మామిడి తోట సమీపంలో ఉంచిన ఒక నాటుబాంబును ఓ ఏనుగు నమిలేందుకు ప్రయత్నించింది. దీంతో బాంబు పేలింది. ఏనుగు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. కళేబరం నుంచి కుళ్లిన వాసన రావడం చూస్తే.. రెండు రోజుల కిందటే చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments