Webdunia - Bharat's app for daily news and videos

Install App

బటన్ నొక్కి చాలా రోజులైంది.. డబ్బులు ఎందుకు జమ చేయలేదు : ఈసీ ప్రశ్న

ఠాగూర్
శుక్రవారం, 10 మే 2024 (17:13 IST)
ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం నుంచి సూటి ప్రశ్న ఒకటి ఎదురైంది. సంక్షేమ పథకాల అమలులో భాగంగా, నగదు బదిలీ పథకాలై ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బటన్ నొక్కి చాలా రోజులైంది. ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు ఎందుకు జమ చేయలేకపోయారని ప్రశ్నించింది. జనవరి 24వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. వారాల పాటు ఆపి ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. ఈ అంశంపై హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని లేఖలో ఈసీ పేర్కొంది. పోలింగ్ తేదీ ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో వివరించాలని సూచించింది. 
 
ఈ ఐదేళ్లలో బటన్ నొక్కిన సమయానికి, నిధుల బదిలీకి మధ్య ఉన్న కాల వ్యవధి ఎంతో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. నిధుల జమకు ఏప్రిల్, మే నెలల్లో కోడ్ ఇబ్బంది ఉంటుందని తెలుసు కదా అని ప్రశ్నించింది. ఇవాళే జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయమై ఉంటే వాటికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలంటూ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల లోపు సమాధానం చెప్పాలంటూ ఈసీ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments