Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఠాగూర్
బుధవారం, 15 మే 2024 (22:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ మహేశ్ కుమార్ గుప్తాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిద్దరికీ సమన్లు జారీ చేసింది. ఏపీలో ఈ నెల 13వ తేదీన లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ తర్వాత రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై కేంద్ర సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఢిల్లీకి వచ్చిన వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీలకు ఈసీ సమన్లు జారీచేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాల‌ని కోరింది. దీంతో స‌చివాల‌యంలో సీఎస్ జవహర్‌ రెడ్డితో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా బుధ‌వారం అత్య‌వ‌స‌రంగా భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కూడా పాల్గొన్నారు. కాగా, సీఎస్‌, డీజీపీ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. పోలింగ్ త‌ర్వాత రాష్ట్రంలో నెల‌కొన్న‌ వాస్తవ పరిస్థితులను ఈసీకి వివరించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments