Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి లోక్‌సభ బై పోల్‌లో దొంగ ఓట్ల దందా... పోలీసులపై ఈసీ కొరఢా!

ఠాగూర్
ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (15:24 IST)
గతంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంలో భారత ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇప్పటికే లోక్‍‌సభ ఉప ఎన్నికల సమయంలో పనిచేసిన కలెక్టరుపై చర్య తీసుకుంది. అలాగే, ఇపుడు పలువురు పోలీసు అధికారులపై ఈసీ కొరఢా ఝుళిపించింది. అప్పటి తిరుపతి నగర తూర్పు, పశ్చిమ సీఐలు శివప్రసాద్ రెడ్డి, శివప్రసాద్‌లపై వేటువేసింది. తూర్పు పీఎస్ ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిని కూడా సస్పెండ్ చేసింది. అలిపిరి అప్పటి సీఐ దేవేంద్ర కుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేసింది. ఉప ఎన్నికల వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ వీరు కేసులను మూసివేశారు. 
 
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైకాపా 34 వేల దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు, ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. ఎపిక్ కార్డుల ఆధారాలు ఉన్నప్పటికీ సమగ్ర విచారణ చేపట్టకుండా కేసును మూసి వేసిన పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి సస్పెన్ష్ ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి.. భారతరత్నతో సత్కరించాలి

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. నిందితుడు బిజోయ్ దాస్ విషయాలు.. ఎక్కడ నుంచి వచ్చాడంటే?

Bulli Raju: సంక్రాంతికి వస్తున్నాం.. బుల్లిరాజుకు పవన్ కల్యాణ్ ఇష్టమట...

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బంగ్లాదేశ్ జాతీయుడే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం