జనవరి 8న నరేంద్ర మోదీ పర్యటన- సర్వం సిద్ధం చేస్తోన్న ఏపీ సర్కారు

సెల్వి
శనివారం, 4 జనవరి 2025 (11:58 IST)
విశాఖపట్నంలో జనవరి 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
 
విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్‌టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ప్రకారం, ఎన్టీపీసీ మూడు దశల్లో ఈ ప్రాజెక్ట్‌లో రూ. 65,370 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 
 
కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్‌ను కూడా ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. రూ.1,518 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును మొదటి దశలో 2,500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 50,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
 
అదేవిధంగా నక్కపల్లిలో 2,001.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,876.66 కోట్లతో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్క్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్కులో రూ.11,542 కోట్ల పెట్టుబడితో 54,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments