Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత సుజనా చౌదరిని టార్గెట్ చేసిన ఈడీ

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (10:54 IST)
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కేంద్రం కనుసన్నల్లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు టార్గెట్ చేశారు. సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా, సుజానా గ్రూప్‌కు చెందిన నాగార్జున హిల్స్‌లో ఈ సోదాలు సాగుతున్నాయి. 
 
హైదరాబాద్ పంజాగుట్టలోని నాగార్జున హిల్స్ కంపెనీలపై చెన్నై నుంచి వచ్చిన ఈడీ బృందం సుమారు 12 గంటల నుంచి విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్ లిమిటెడ్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీలతోపాటు జూబ్లీహిల్స్‌లోని సుజనా నివాసంలో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. 
 
కాగా, ఇటీవల టీడీపీకి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత సీఎం రమేష్ కంపెనీలతో పాటు.. సీఆర్డీఏ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు కంపెనీల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ సర్కారు సీబీఐ ప్రవేశంపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇక్కడ ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే: మెగాస్టార్ చిరంజీవి

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

పవన్ కల్యాణ్ పెద్ద స్థాయికి వెళతారని పంజా టైమ్‌లోనే అర్థమైంది : డైరెక్టర్ విష్ణు వర్ధన్

కొత్తదనం కావాలనుకునే వారు తల సినిమా ఆనందంగా చూడవచ్చు : అమ్మరాజశేఖర్

రాజా మార్కండేయ ట్రైలర్ లో మంచి కంటెంట్ వుంది : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments