Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నగారా మోగింది.. జగన్ సర్వేలో తేలిన వ్యక్తినే..?

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (08:32 IST)
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 23వ తేది నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆ రోజు నుండే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం అవుతుంది. 30వ తేది నామినేషన్ల్ల దాఖలుకు చివరి తేది. 31న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఏప్రిల్‌ 3న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది. 
 
ఏప్రిల్‌ 17న ఎన్నికలు జరుగుతాయి. మే 2 వ తేది కౌంటింగ్‌ జరుగుతుంది. మే 4తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. వైసిపికి చెందిన సిట్టింగ్‌ ఎంపి బల్లి దుర్గాప్రసాద్‌ మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. 
 
తెలంగాణలో నాగార్జునసాగర్‌ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికకకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇక్కడ టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. సాగర్‌లో కైడా ఏప్రిల్‌ 17న పోలింగ్‌, మే 2న కౌంటింగ్‌ జరగనుంది. షెడ్యూల్‌ విడుదల కావడంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.
 
తిరుపతి పార్లమెంట్‌ ఉప పోరులో వైసిపి అభ్యర్థిగా డాక్టర్‌ గురుమూర్తిని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. సీఎం జగన్‌ చేయించిన సర్వేలో కొత్త వ్యక్తికే గెలుపు సునాయాసమని తేలడంతో దళితుడైన గురుమూర్తి అనూహ్యంగా తెరపైకి వచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాట్ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

తెలుగు సినిమాలను, నటులను పరభాషలో లెక్కచేయరంటున్న హీరో

విజయ్ ఆంటోని భద్రకాళి టీజర్ రాబోతుంది

దళపతి విజయ్ కి గ్రాండ్ వీడ్కోలు పలికే ప్రత్యేక పాట !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

తర్వాతి కథనం
Show comments