Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్ సహజీవనం చేస్తున్న యువతితో అక్రమ సంబంధం పెట్టుకునీ...

Webdunia
ఆదివారం, 28 జులై 2019 (13:41 IST)
తన స్నేహితుడు సహజీవనం చేస్తున్న యువతితో అక్రమం సంబంధం పెట్టుకున్న యువకుడు చివరకు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలోని సూర్యారావుపాలెం రోడ్డులో బ్రాందిషాపు వద్ద జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మొగల్తూరు గ్రామానికి చెందిన గుడాల శివరామకృష్ణ, దువ్వ గ్రామానికి చెందిన కామన బాలాజీ(25)లు గతంలో గల్ఫ్‌ దేశం ఉపాధి నిమిత్తం వెళ్లి స్నేహితులయ్యారు. తిరిగి స్వగ్రామానికి వచ్చిన అనంతరం రామకృష్ణ సహజీవనం చేస్తున్న యువతితో బాలాజీ స్నేహం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగించాడు.
 
ఈ విషయం తెలుసుకున్న శివరామకృష్ణ స్నేహితుడిని పలుసార్లు హెచ్చరించాడు. వినకపోవడంతో ఆ యువతిని గల్ఫ్‌ దేశానికి పంపించాడు. అయినా బాలాజీ తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండడంతో విషయాన్ని బాలాజీ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాడు. ఫలితం లేకపోవడంతో కక్ష పెంచుకున్న శివరామకృష్ణ శుక్రవారం బాలాజీని కలిసి ఇదే విషయమై మాట్లాడుకున్నారు. 
 
ఆ తర్వాత శుక్రవారం రాత్రి 9 గంటలకు దువ్వ బ్రాంది షాపులో ఇద్దరు మద్యం తాగారు. ఆ సమయంలో బాలాజీ అతని ముందే ఆ యువతితో ఫోన్‌లో మాట్లాడడంతో శివరామకృష్ణ ఆగ్రహంతో ఊగి పోయాడు. వెంటనే తన దగ్గరున్న పదునైన చాకుతో బాలాజీ పీకపై పొడిచి పరారయ్యాడు. బాలాజీ వైన్‌షాపు ఆవరణలోనే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసులోని మిస్టరీని ఛేదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments