Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 నుంచి వాడ‌ప‌ల్లి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (11:03 IST)
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామిగా పేరొందిన బ్రహ్మాండ నాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తరహాలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల25 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను కొవిడ్‌ నిబంధనల ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం వేదపండితులు, అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ నిర్వహిస్తారు. 
 
25న శేషవాహనసేవ, 26న హంసవాహన సేవ, 27న హనుమద్వాహన సేవ, 28న సింహవాహన సేవ, 29న గరుడవాహన సేవ, 30న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, 31 ఆదివారం గజవాహన సేవ, నవంబరు 1న అశ్వవాహన సేవ, 2న చక్రస్నాన మహోత్సవాలను కనుల పండువగా జరపనున్నారు. శ్రీనివాస కల్యాణం, వేంకటేశ్వరస్వామి హోమం, మహాసుదర్శన హోమం, అష్టోత్తర కలశాభిషేకం, సహస్ర దీపాలంకరణ సేవ, లక్ష కుంకుమార్చన, తిరుప్పావడ సేవ, అభిషేకాలు, పుష్పయాగం తదితర ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. చైర్మన్‌ రమేష్‌రాజు అమలాపురం ఎంపీ చింతా అనురాధను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రిక అందజేశారు. ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నామని ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments