ఉద‌యాన్నే మంచు గ‌జ‌గజ‌... కాశ్మీరులోయను తలపిస్తున్న తుని!

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (10:49 IST)
నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు చ‌లి మాత్ర‌మే ఉండేది. కానీ ఇపుడు దానికి మంచు తోడ‌యింది. ఉద‌యాన్నే మంచు తెర‌లు క‌మ్ముకుని, తెల్ల‌ని దుప్ప‌టిలా ఊర్ల‌ను క‌ప్పేస్తోంది. ఊర్ల‌న్నీ కాశ్మీర్ లోయ‌ల‌ను త‌ల‌పించేలా మారుతున్నాయి.

 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణం అంతా మంచు క‌ప్పేస్తోంది. కొత్త సురవరం ప్రాంతం కాశ్మీరు లోయలా మ‌రిపోయింది. కొండ‌లు, లోయ‌ల‌ను తలపించే విధంగా మంచు ప్రభావం ప్రకృతి సోయగాల నడుమ అంద‌రినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఆ ప్రాంతంలో నివాసాలు ఏమాత్రం కంటికి కనిపించకుండా, కారు మబ్బుల వలె పూర్తి స్థాయిలో ప్రకృతి  సోయగం ఆకట్టుకుంటోంది. 
 
 
 ఒకవైపు సూర్యకిరణాలు ఆ ప్రాంతంలో పడుతున్నప్పటికీ, అక్కడున్ననివాసాలు, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పచ్చని పంట పొలాలు ఏమాత్రం కనిపించని విధంగా మంచు దుప్పటి కప్పివేసింది. ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న ప్రకృతి సోయగాన్ని పలువురు వారి ఫోన్ లో బంధించుకుంటూ, ఉత్సాహంగా ప్రజలంతా గడుపుతున్నారు. చలి తీవ్రత సైతం ఎక్కువగా ఉండడంతో  గజగజలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినా, ఈ వాతావ‌ర‌ణాన్ని స్థానికులు ఎంజాయ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments