Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంట్లు తోముతూ అడ్డంగా కూర్చుంది.. దారి ఇవ్వలేదని కర్రతో కొట్టి చంపిన బావ

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (11:13 IST)
మరదలిని బావ హతమార్చిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అంట్లు తోముకుంటున్న మరదలు దారికి అడ్డుగా వుందని.. బావ ఆమెను చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు, పటవల శాంతిమూల ఎస్సీపేటలో పోలినాటి నాగమణి నివాసం ఉంటోంది. ఆమెకు ముగ్గురు కుమారులు. 
 
పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం, రెండో కుమారుడు శ్రీనివాస్‌‌లు ఒక ఇంట్లో, మూడో కుమారుడు సత్యనారాయణ, ఆయన భార్య మాధవి మరో ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి నాలుగేళ్ల కుమార్తె, 15 నెలల కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంటి ముందు రోడ్డుపై మాధవి అంట్లు తోముతుండగా, ఆమె బావ శ్రీనివాస్ మద్యం తాగి అటుగా వచ్చాడు. 
 
ఇలా అడ్డుగా కూర్చుంటే, తన ఇంట్లోకి ఎలా వెళ్లాలి? అంటూ ఆగ్రహంతో వాగ్వాదానికి దిగాడు. పక్కనుంచి వెళ్లాలని మాధవి చెప్పగా, పక్కనే ఉన్న కర్ర తీసుకుని, ఆమె తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మాధవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments