Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంట్లు తోముతూ అడ్డంగా కూర్చుంది.. దారి ఇవ్వలేదని కర్రతో కొట్టి చంపిన బావ

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (11:13 IST)
మరదలిని బావ హతమార్చిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అంట్లు తోముకుంటున్న మరదలు దారికి అడ్డుగా వుందని.. బావ ఆమెను చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు, పటవల శాంతిమూల ఎస్సీపేటలో పోలినాటి నాగమణి నివాసం ఉంటోంది. ఆమెకు ముగ్గురు కుమారులు. 
 
పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం, రెండో కుమారుడు శ్రీనివాస్‌‌లు ఒక ఇంట్లో, మూడో కుమారుడు సత్యనారాయణ, ఆయన భార్య మాధవి మరో ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి నాలుగేళ్ల కుమార్తె, 15 నెలల కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంటి ముందు రోడ్డుపై మాధవి అంట్లు తోముతుండగా, ఆమె బావ శ్రీనివాస్ మద్యం తాగి అటుగా వచ్చాడు. 
 
ఇలా అడ్డుగా కూర్చుంటే, తన ఇంట్లోకి ఎలా వెళ్లాలి? అంటూ ఆగ్రహంతో వాగ్వాదానికి దిగాడు. పక్కనుంచి వెళ్లాలని మాధవి చెప్పగా, పక్కనే ఉన్న కర్ర తీసుకుని, ఆమె తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మాధవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments