Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 నుంచి ‘ద్వాదశి’ దర్శన టికెట్టు : టీటీడీ ఈవో

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (22:17 IST)
ద్వాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలకునే వారికి ఈ నెల 24 నుంచి టికెట్లు ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసుకుంటోంది. సాదారణంగా అయితే ప్రత్యేక దర్శనాన్ని 29 నుంచే నిలిపేసినప్పటికీ ఆన్ లైన్ విధానంంలో టికెట్లు పొందేవారికి కూడా ఈ అవకాశం కలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో డి.సాంబశివరావు తెలిపారు. 
 
శుక్రవారం తిరుమలలో టిటిడి విభాగాధిపతులతో ఏర్పాటు చేసిన సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లపై చర్చించినట్లు చెప్పారు. వచ్చే భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడనున్నట్లు వివరించారు. అదే సమయంలో ఏకాదశి నాడు కైంకార్యాలు కూడా ఉంటాయని, అదే సమయంలో జనవరి 1 తేదీ కావడంతో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. వైకుంఠ ద్వార దర్శనం కనీసం 70 వేల మందికి చేయించగలగులుతామన్నారు. 
 
ద్వాదశి రోజున వైకుంఠ దర్శనం చేసుకోవడానికి 10 వేల ఆన్ లైన్ టెకెట్లను మంజూరు చేస్తామని చెప్పారు. ఆన్ లైన్ ద్వారా టికెట్లు పొంద దలుచుకున్న వారు ఈ నెల 24 నుంచి ఇంటర్నట్ ద్వారా బుకింగ్ చేసుకోెవచ్చునని చెప్పారు. విఐపిల వెంట కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. వారు కూడా పరిస్థితి అనుసరించి వ్యవహరించుకోవాలని కోరారు.  
 
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments