Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్... 9,061 పోస్టులు... మంత్రి గంటా వెల్లడి

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (18:21 IST)
ఏపీ డీఎస్సీ 2014 నోటిఫికేషన్‌ను జారీ చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 9061 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో 1949 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు, 812 భాషా పండితులు, 156 పీఈటీ, 6244 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు డిసెంబర్ 3 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 9, 10, 11 తేదీల్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు జరుగుతని చెప్పారు. జూన్ 28న ఉపాధ్యాయ నియామక రాత పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 
 
మరోవైపు.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా విడుదల చేసిన డీఎస్సీ-2014 నోటీఫికేషన్ షెడ్యూల్ అస్పష్టంగా ఉందని పలువురి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డీఎస్సీతో పాటు టెట్ పరీక్షను కూడా ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. 
 
తాజా డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్‌తో గతంలో టెట్ అర్హులైన వారు కూడా మరోసారి పరీక్ష రాయాల్సి ఉండటంతో గందరగోళానికి తావిస్తోంది. అయితే టెట్ పరీక్షల్లో వెయిటేజీ ఆధారంగానే డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments