Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానంతో ఆమె గొంతుకోశాడు.. ఐదునెలల పసికందును కూడా?

భార్యపై అనుమానంతో ఆ భర్త కిరాతకుడిగా మారాడు. భార్యను, ఐదు నెలల పసికందును గొంతుకోసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్‌‌లో డిసెంబర్ 31న ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కరీంనగర్‌కు

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (11:09 IST)
భార్యపై అనుమానంతో ఆ భర్త కిరాతకుడిగా మారాడు. భార్యను, ఐదు నెలల పసికందును గొంతుకోసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్‌‌లో డిసెంబర్ 31న ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్,అదే జిల్లాలోని నస్పూర్ మండలం‌‌కు చెందిన బాలమ్మను ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. 
 
బాలమ్మ ఐదు నెలల క్రితం పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ శ్రీనివాస్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్యను తనతో పంపించాలని ఆమె పుట్టింటికి వెళ్లి వేధించాడు. తాగి గొడవకు కూడా దిగాడు. దీంతో పెద్దలు జోక్యం చేసుకుని శ్రీనివాస్‌, బాలమ్మలకు నన్పూర్‌లో కాపురం పెట్టించారు.
 
అయితే శ్రీనివాస్‌లో భార్యపై అనుమానం తగ్గలేదు. అంతే ఆదివారం సాయంత్రం మద్యం సేవించి గొడవకు దిగాడు. భార్య వాదించడంతో కోప్రోదిక్తుడైన భర్త ఇంట్లో ఉన్న కత్తితో భార్య గొంతుకోసేశాడు. అనంతరం తల్లిపక్కనే పడుకుని ఉన్న పసికందును కూడా గొంతు కోసి చంపాడు. రక్తపుమడుగుల్లో విగతజీవిగా పడివున్న తల్లి కొడుకులను చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న శ్రీనివాస్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments