బస్సు స్టెప్నీ టైరుపై పడుకుని 20 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తాగుబోతు!! (Video)

ఠాగూర్
ఆదివారం, 16 మార్చి 2025 (10:08 IST)
ఓ తాగుబోతు పెను ప్రాణాపాయం నుంచి తప్పిచుకున్నాడు. బస్సు వెనుక కింద భాగాన ఉన్న స్టెప్నీ టైరుపై పడుకొని గుర్తు తెలియని ఓ వ్యక్తి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం అందిరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కొత్త చెరువు నుంచి హిందూపురానికి ఆర్టీసీ బస్సు ఒకటి బయలుదేరింది. పెనుకొండ సమీపంలోని రాంపురం వద్ద బస్సు వెళుతుండగా బస్సు కింది భాగంలో కాళ్లు వేలాడుతుండటాన్ని ద్విచక్రవాహనంపై వెళుతున్న వాహనదారులు గమనించి డ్రైవర్‌కు చెప్పారు. 
 
ఆ వెంటనే బస్సును పక్కన ఆపిన డ్రైవర్ చిరంజీవి రెడ్డి స్టెప్నీ భాగంలో చూడగా, మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి స్టెప్నీ టైర్‌మీద నుంచి కిందకు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతని వివరాలను ఆరా తీయగా చెప్పలేదు. దీంతో దండించి పంపించి వేశారు. అయితే, ఈ ఘటనలో అతనికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో డ్రైవర్, కండక్టర్‌, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments