పార్టీలో చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారు : డొక్కా మాణిక్యవరప్రసాద్

ఠాగూర్
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (16:36 IST)
ఏపీ మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరారు. ఈ చేరికపై మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ తన స్పందన తెలియజేశారు. పార్టీలో చేరిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారంటూ కామెంట్స్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒక మిత్రుడుగా శైలజనాథ్‌కు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నానని, వైకాపాలో విలువలు, విశ్వసనీయతలు ఉండవని పార్టీలో చేర్చుకునే ముందు ఎంతో ఆప్యాయంగా ఉంటారని, చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారని తెలిపారు. 
 
వైకాపాలో ఇప్పటికే 74 మంది నేతలు ఎన్నో ఇబ్బందులుపడ్డారని డొక్కా అన్నారు. దళితులకు ఆ పార్టీలో విలువ ఉండదని చెప్పారు. దళితులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ వైకాపా అని వ్యాఖ్యానించారు. శైలజానాథ్‌కు రాజకీయ భవిష్యత్ ఉండాలంటే ఆ పార్టీలో చేరకపోవడమే మంచిదని సూచించారు.
 
కాగా, శింగనమల వైకాపా ఇన్‌చార్జ్‌గా శైలజానాథ్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. గత 30 యేళ్లుగా ఇదే సెంటిమెంట్ కొనసాగుతుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments