Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బయోమెట్రిక్ తో పని లేదు.. అమల్లోకి ఐరిష్ విధానం

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (08:30 IST)
రాష్ట్రములోని సచివాలయ ఉద్యోగులు ఎవరూ బయోమెట్రిక్ వల్ల ఇబ్బందులు పడాల్సిన పని లేదని, ఇప్పటికే అన్ని చోట్ల ఐరిష్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని ఏపీ గ్రామ వార్డు సచివాలయాల మీడియా విభాగం సంయుక్త సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.

బయోమెట్రిక్ అమల్లో కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆ శాఖ మీడియా విభాగం సంయుక్త సంచాలకులు స్పందించారు. సాంకేతికంగా ఎక్కడ  ఏ ఇబ్బంది ఎదురైనా వెంటనే చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. 

కోవిద్ నేపథ్యంలో వేలిముద్రల ద్వారా హాజరును తీసుకోవడం సురక్షితం కాదని ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు తీసుకొని ఐరిష్ విధానాన్ని అమలు చేసిందని చెప్పారు. యాప్ లో హాజరును నమోదు చేయడంలో ఏ ఇబ్బందులు ఉన్నా వెంటనే కమిషన్ కార్యాలయంలోని ప్రత్యేక విభాగానికి ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments