Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాండేజ్ క్లాత్, దూదిని కడుపులో ఉంచి కుట్టువేశారు... ఎక్కడ?

వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణంబలైంది. సర్జరీ సమయంలో వైద్యుల అజాగ్రత్త వల్ల బ్యాండేజ్ క్లాత్, దూదిని కడుపులో ఉంచి కుట్లు వేశారు. దీంతో కొన్ని రోజుల తర్వాత ఆమె పేగులు విషపూరితం కావడంతో మహిళ మృతి

Webdunia
బుధవారం, 11 జులై 2018 (08:28 IST)
వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణంబలైంది. సర్జరీ సమయంలో వైద్యుల అజాగ్రత్త వల్ల బ్యాండేజ్ క్లాత్, దూదిని కడుపులో ఉంచి కుట్లు వేశారు. దీంతో కొన్ని రోజుల తర్వాత ఆమె పేగులు విషపూరితం కావడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన  రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
 
జిల్లాలోని షాబాద్‌ మండలం అప్పారెడ్డిగూడకు చెందిన హరిత అనే మహిళ నిండు గర్భిణి. ఈమె గత 2017 అక్టోబరు 3వ తేదీన ప్రసవ నొప్పులతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అయితే, సిజేరియన్ ఆపరేషన్ ద్వారా మాత్రమే కాన్పు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. 
 
దీంతో ఆపరేషన్‌కు వారు సమ్మతించారు. ఆ తర్వాత సర్జరీ ముగిసిన తర్వాత పొరపాటున కడుపులో బ్యాండేజీ క్లాత్‌, దూదిని ఉంచి కుట్లు వేశారు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఉస్మానియా పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మే 27వ తేదీన శస్త్రచికిత్స చేసి కడుపులోంచి బ్యాండేజీ క్లాత్‌‌ను, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించారు. 
 
అయితే, అప్పటికే పేగులు విషపూరితం కావడం వల్ల గత నెల 15వ తేదీ ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తన సోదరి మృతి చెందిందని.. ఆమె సోదరుడు రవి మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు రంగారెడ్డి ఆరోగ్యశాఖ జిల్లా కోఆర్డినేటర్‌‌కు హెచ్ఆర్సీ నోటీసుల జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments