Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలల్లో సౌకర్యాల కల్పనలో రాజీపడొద్దు: జగన్

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (06:02 IST)
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్ఠికాహార లోపాన్ని పూర్తిగా నివారించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు.

మధ్యాహ్న భోజనంలో పిల్లలకు మరో ప్రత్యేక వంటకం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీనిపై ప్రతిపాదనలు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచటంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం సహా పౌష్ఠికాహారంపై సమీక్ష నిర్వహించారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు సురేష్, తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల్లో మరో 65 సెంట్రలైజ్డ్‌ కిచెన్స్‌ ఏర్పాటుపైనా సీఎం చర్చించారు. గర్భిణీలు, పిల్లల తల్లులకు, చిన్నారులకు పౌష్ఠికాహారంపై వివరాలు తెలుసుకున్నారు.

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్ఠికాహారం తప్పక అందించాలని సీఎం ఆదేశించారు. వీటిలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులతో విస్తృతంగా చర్చించిన సీఎం... వీరికి నగదు బదిలీ చేసే అంశంపైనా సమాలోచనలు చేశారు.

తల్లులు, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించాలన్న ఆయన.. వీటన్నింటిపైనా ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments