Webdunia - Bharat's app for daily news and videos

Install App

28 లక్షల ల‌బ్ధిదారులకు రేష‌న్ పంపిణీ: మంత్రి కొడాలి నాని

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (08:10 IST)
‌రాష్ట్రంలో 1.52 కోట్లకు పైచిలుకు రేషన్ కార్డులు ఉన్నాయని 15వ విడతలో ఇప్పటివరకు 28.01 లక్షలు ల‌బ్ధిదారుల‌కు ఉచితంగా 44.518 మెట్రిక్ టన్నుల బియ్యం 2.655 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ఈ మేర‌కు మంత్రి కొడాలి నాని క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

పోర్టబులిటీలో భాగంగా అనంతపురం జిల్లాలో 69 వేల 298 రేషన్ కార్డుదారుల‌కు, చిత్తూరులో 45వేల 796 కార్డులకు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక లక్ష 03 వేల 733 కార్డులకు, గుంటూరు జిల్లాలో ఒక లక్షా నలభై రెండు వేల 988 కార్డులకు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 57 వేల 397 రేషన్ కార్డులకు, కృష్ణాజిల్లాలో 89 వేల 186 కార్డులకు, కర్నూలు జిల్లాలో ఒక లక్ష02 వేల 680 కార్డులకు, 

నెల్లూరు జిల్లాలో 35 వేల 017 కార్డులకు, ప్రకాశం జిల్లాలో 59 వేల 028 కార్డులకు, శ్రీకాకుళం జిల్లాలో 20వేల 171 కార్డులకు, పశ్చిమగోదావరి జిల్లాలో 79వేల 307 కార్డులకు నిత్యావసర సరుకులను అందచేసమన్నారు.

అలాగే అనంతపురం జిల్లాలో12 లక్షల73 వేల 615 రేషన్ కార్డులు ఉండగా వీరిలో 2 లక్షల 35 వేల  457 రేషన్ కార్డులకు 4 వేల 091 మెట్రిక్ టన్నుల బియ్యం, 226 మెట్రిక్ టన్నుల కంది పప్పును ఉచితంగా సరఫరా చేయాసమన్నారు. సమావేశంలో తదితర జిల్లాకు పంపిన బియ్యం, కంది పప్పు వివరాలను తెలిపారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments