Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీక్ష చేసే అర్హత జగన్ మోహన్ రెడ్డికి ఉందా : ధూళిపాళ్ల నరేంద్ర

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (14:50 IST)
ఒక్క ప్రత్యేక హోదా మాత్రమే కాదు, ఏ అంశంపైనా అయినా దీక్ష చేసే అర్హత వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఉందా అని టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇచ్చేది రాష్ట్రం కాదు కేంద్రమనే విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. ఇందుకోసం ఢిల్లీలో చేయాలే కానీ, గల్లీల్లో కాదన్నారు.  
 
రాష్ట్రంలో అమాయక యువతను బలి చేయడానికే జగన్ దీక్ష చేపడుతున్నారని మండిపడ్డారు. 8 మంది ఎంపీలున్న జగన్ ఢిల్లీలో ఎందుకు దీక్ష చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలిగితే జగన్ చేరాలని చూస్తున్నారని, అవినీతి, అరాచకాలకు లోటస్ పాండ్ అడ్డా అని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. అందుకు అనుగుణంగానే జగన్ అడుగులు వేస్తున్నారని విమర్శించారు. కానీ, జగన్ కలలు పగటి కలలుగానే మిగిలిపోతాయని ధూళిపాళ్ళ జోస్యం చెప్పారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments