Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు విచార‌ణ‌; దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అరెస్ట్

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (11:26 IST)
మాజీ మంత్రి, వైసీపీ నేత వై.ఎస్. వివేకానంద రెడ్డి హ‌త్య కేసును సీబీఐ చాలా లోతుగా విచారిస్తోంది. ఇందులో భాగంగా సీబీఐ హైదరాబాద్‌లో నిన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని అరెస్టు చేసింది. ఉస్మానియాలో వైద్య పరీక్షల తర్వాత మేజిస్ట్రేట్‌ ముందు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని హాజరుపరిచారు. అనంత‌రం ట్రాన్సిట్ వారెంట్‌పై శివ శంకర్ రెడ్డిని కడపకు తరలించారు. 

 
 
ఈ ఉదయం 10 గంటలకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు కడపకు తీసుకువ‌చ్చారు. నిందితుడిని ఈ మధ్యాహ్నంలోపు పులివెందుల కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే, త‌నకు ఆరోగ్యం బాగోలేద‌ని, వివేకా హ‌త్య‌తో త‌న‌కు సంబంధం లేద‌ని, న్యాయం చేయాలని కోరుతూ, సీబీఐకి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి లేఖ రాశాడు.

 
మరో ప‌క్క త‌న తండ్రికి వివేకా హత్యకేసులో ఎలాంటి సంబంధం లేద‌ని, ఆయ‌న కుమారుడు డి.చైతన్యరెడ్డి చెపుతున్నాడు. కేవలం ఆరోపణతోనే త‌న తండ్రిని అరెస్టు చేశార‌ని, ఈ నెల 15న త‌న  తండ్రి ఎడమ భుజానికి సర్జరీ జరిగింద‌ని చెప్పాడు. ఇంకా వైద్య చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంద‌ని, అనారోగ్యంతో ఉన్నందున త‌న తండ్రిని విడిచిపెట్టాల‌ని, త‌గిన న్యాయం చేయాలని సీబీఐకి  దేవిరెడ్డి చైతన్యరెడ్డి విజ్ణ్న‌ప్తి చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments