సోనియా బర్త్‌డేకు రెండు ముక్కలు.. జగన్ పుట్టిన రోజుకు మూడు ముక్కలు

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (16:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలైపోతోంది. గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. ఇపుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే రోజున 13 జిల్లాలతో ఉన్న నవ్యాంధ్రను మూడు ముక్కలు చేశారనీ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. 
 
ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనపై దేవినేని ఉమ స్పందించారు. 'నాడు సోనియాగాంధీ పుట్టినరోజున రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. ఇప్పుడు సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా రాజధానిని మూడు ముక్కలుగా విభజించారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
జీఎన్‌ రావు కమిటీ రాష్ట్రంలో ఎక్కడా పర్యటించిన దాఖలాలు లేవన్నారు. ఆ కమిటీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదించక ముందే సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల మాజీ హోం మంత్రి చిన్నరాజప్ప అనుమానాలు వ్యక్తం చేశారు. అది జీఎన్‌ రావు కమిటీ కాదని... జగన్మోహన్‌ రెడ్డి కమిటీ అని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments