Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై ప్రభావం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమేణా వాయుగుండంగా మారనుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అల్పపీడనం 18 నాటికే వాయుగుండ

Webdunia
గురువారం, 13 జులై 2017 (10:15 IST)
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమేణా వాయుగుండంగా మారనుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అల్పపీడనం 18 నాటికే వాయుగుండంగా మారి ప్రభావం చూపుతుంది. ఫలితంగా జూలై 16, 17, 18 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవన కాలంలో ఏర్పడుతున్న ఈ వాయుగుండం వల్ల రుతుపవనాలు బలంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 20, 21, 22 తేదీల్లో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాపై ఈ ప్రభావం కనిపిస్తోందని తెలిపింది. ఆ జిల్లాల్లో రానున్న నాలుగు రోజులూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే సూచనలున్నాయి.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments