Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి శిక్ష పడింది... రెండేళ్ళ జైలు

కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షిపై చేయి చేసుకుని ఆ తర్వాత అధికార బలంతో ఆ కేసు నుంచి తప్పించుకున్న అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఎట్టకేలకు శిక్ష పడింది.

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (15:04 IST)
కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షిపై చేయి చేసుకుని ఆ తర్వాత అధికార బలంతో ఆ కేసు నుంచి తప్పించుకున్న అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఎట్టకేలకు శిక్ష పడింది. ఈయనకు మూడు కేసుల్లో రెండేళ్ళ జైలుశిక్ష విధిస్తూ భీమడోలు మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవిని సైతం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
కాగా, గత ఎన్నికల్లో చింతమనేని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన 2011లో గ్రామసభలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చేయి చేసుకున్నారు. 
 
ఈ కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. అలాగే, గన్‌మెన్‌ను కొట్టిన కేసులో 6 నెలలు, రచ్చబండ వేదిక దగ్గర గొడవకు కారణమైనందుకు మరో ఆరు నెలలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో ఆయన అనుభవించాలని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments