Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ ఓయో హోటల్‌లో ఢిల్లీ యువతి గ్యాంగ్ రేప్... సర్వీస్ బాయ్స్ దారుణం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఢిల్లీ యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... బంజరాహిల్స్‌లో ఓయో హోటల్ ఉంది.

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (10:47 IST)
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఢిల్లీ యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... బంజరాహిల్స్‌లో ఓయో హోటల్ ఉంది. ఈ హోటల్‌లో ఢిల్లీకి చెందిన 20 యేళ్ల హైదరాబాద్ నగరాన్ని సందర్శించేందుకు వచ్చిన దిగింది. ఆమె ఆన్‌లైన్‌లో ఈ హోటల్ గదిని బుక్ చేసుకుంది. ఆ యువతి ఒంటరిగా ఉండటం గమనించిన హోటల్ రూం సర్వీస్ బాయ్స్ ఆమెపై కన్నేశారు. 
 
అయితే, ఆ యువతి నగరాన్ని చుట్టి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒంటరిగా హోటల్‌కు చేరుకుంది. ఆమె హోటల్ లిఫ్టు ఎక్కుతుండగా చుట్టుముట్టి వేధించారు. వారి నుంచి తప్పించుకున్న ఆ యువతి.. తన గదికి చేరుకుంది. ఆ తర్వాత వేకువజామున 4 గంటల సమయంలో రూం కాలింగ్ బెల్ కొట్టడంతో లేచిన ఆమె 'ఎవరు?' అని ప్రశ్నించడంతో 'రూం బాయ్' అని సమాధానం విని తలుపులు తీసింది. దీంతో వెటనే ఆమె రూంలోకి దూరిన నలుగురు హోటల్ సిబ్బంది తుపాకీ చూపించి బెదిరించి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. 
 
దీనిపై బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, హోటల్‌లో రూం బాయ్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నలుగురూ హోటల్ సిబ్బంది అని తేలింది. వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులంతా నెల్లూరు వాసులుగా తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం