Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు కొండచరియలు విరిగిపడి.. 14జవాన్లు మృతి.. తెలుగు సైనికుడు కూడా?

విపరీతంగా కురుస్తున్న మంచు సైనికులను పొట్టనబెట్టుకుంటోంది. జమ్మూకాశ్మీర్‌లోని గందేర్‌బాల్, బండిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్ పరిధిలో మంచు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన సైనికుల సంఖ్య 14కి చ

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2017 (17:03 IST)
విపరీతంగా కురుస్తున్న మంచు సైనికులను పొట్టనబెట్టుకుంటోంది. జమ్మూకాశ్మీర్‌లోని గందేర్‌బాల్, బండిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్ పరిధిలో మంచు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన సైనికుల సంఖ్య 14కి చేరింది. వీరిలో ఓ తెలుగు జవాన్ కూడా మరణించినట్లు సైనికాధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం గ్రామానికి చెందిన మామిడి నాగరాజు(25) భారత సైన్యంలో పనిచేశాడు. 
 
అయితే మంచు కారణంగా అతను ప్రాణాలు కోల్పోయినట్లు సైనికాధికారులు వెల్లడించారు. నాగరాజుకు ఏడాది క్రితమే సమీప బంధువు అనూషతో వివాహం జరిగింది. రాజు మరణంతో కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాద ఛాయలు నెలకొన్నాయి.
 
మరోవైపు గురెజ్ సెక్టార్‌లో సైనిక శిబిరంపై మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఆర్మీ సిబ్బంది ఇప్పటివరకు ఆరుగురు జవాన్లను రక్షించారు. ఇంకా మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు సైనికాధికారులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments