Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలసకూలీలను కబళించిన మృత్యువు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (12:59 IST)
కరోనా వైరస్‌ బారి నుంచి తప్పించుకున్నా మృత్యువు నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఇద్దరిని కబళించింది.

చేబ్రోలు ఎస్సై వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం..పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని కైకరం వద్ద జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 

ఇద్దరు యువకులు సైకిల్‌పై ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళుతుండగా వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మృతుల చరవాణి ఆధారంగా వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మృతుల వద్దనున్న వస్తువులను బట్టి వారు వలసకూలీలుగా అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments